శ్రీశైలం : శ్రీశైల మల్లన్న ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. 22 రోజుల్లో రూ.3,56,20,325 ఆదాయం వచ్చిందని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి లవన్న తెలిపారు. భ్రమరాంబ, మల్లికార్జునస్వామి ఆలయాల్లోని హుండీలను బుధవారం ఆలయ ప్రాకారంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అధికారుల సమక్షంలో శివసేవకులు, సిబ్బంది లెక్కించారు. ఇందులో 1,435 యూఎస్ఏ డాలరు, 70 కెనడియన్ డాలర్లు, పది యూరోలు, రెండు సింగర్పూర్ డాలర్లను భక్తులు హుండీల్లో వచ్చాయని అధికారులు తెలిపారు.