జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ
కలెక్టర్తో కలిసి వ్యాన్ సేవలు ప్రారంభం
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 30: జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్ సరఫరా ఇకనుంచి సులభతరం కానున్నదని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొం డ అరుణ పేర్కొన్నారు. వ్యాక్సిన్ సరఫరా కోసం ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన వ్యాన్ను కలెక్టర్ కృష్ణభాస్కర్తో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించి, మాట్లాడారు. వ్యాన్ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్సీలకు వ్యాక్సిన్ సరఫరా చేసుకోవడం సులభతరం అవుతుందన్నారు. వ్యాక్సిన్ను నిల్వ చేసేందుకు వ్యాన్లో సరిపడా ఉష్ణోగ్రతలు అం దుబాటులో ఉంటాయని చెప్పారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరిస్తూ, కొవి డ్ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించారు. ఇక్కడ అదనపు కలెక్టర్ అం జయ్య, ఇన్చార్జి డీఎంహెచ్వో శ్రీరాములు, డీఐవో మహే శ్, పీవోలు అనిల్కుమార్, కపిలసాయి ఉన్నారు.
వ్యాక్సిన్ సురక్షితం
కోనరావుపేట, ఏప్రిల్ 30: కొవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని, అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కొవిడ్ వ్యాక్సిన్, నిర్ధారణ పరీక్షలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు మండల పరిధిలో ఎంత మంది వ్యాక్సిన్ వేసుకున్నారు? రోజుకు ఎంత మంది టీకా వేసుకుంటున్నారు? వ్యాక్సిన్ ఎంత స్టాక్ ఉంది? అంటూ వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్పై అపోహలు నమ్మవద్దన్నారు. టీకా సురక్షితమని తెలుపుతూ వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. లక్షణాలుంటే ప్రతిఒక్కరూ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైరస్ను అరికట్టడానికి అందరూ సహకరించాలని కోరారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇక్కడ తహసీల్దార్ నరేందర్, వైద్యాధికారి మోహన్కృష్ణ, సీహెచ్వో బాలచంద్రం, సూపర్వైజర్ శ్రీదేవి ఉన్నారు.