Devotional | తర్కం లేని భక్తిని, ఆచారాలను రమణ మహర్షి తీవ్రంగా ఖండించేవారు. ఒకసారి ఒక భక్తురాలు అరుణాచలం వచ్చింది. మహర్షిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుంది. స్వామితో ‘భగవాన్! నేను లక్ష పత్రుల వ్రతం చేశాను’ అని గర్వంగా చెప్పింది.
అప్పుడు రమణులు ఆమెతో ‘అయ్యో! నీ వ్రతం కోసం చెట్టును అన్నిసార్లు గిల్లి ఆకులు కోశావా. అలాంటి వ్రతం చేయడం ఎందుకు? నిన్నే నువ్వు లక్షసార్లు గిల్లుకోలేకపోయావా!’ అన్నారు. ఇలా భక్తి పేరుతో మూర్ఖంగా ప్రవర్తించేవారిని రమణులు కట్టడి చేసేవారు. భక్తిని చాటుకునేందుకు ఏ ప్రాణినీ హింసించాల్సిన అవసరం లేదని తెలియజెప్పేవారు.
… మనోజ్ఞ
గర్భిణికి సీమంతం ఎందుకు చేస్తారు?
Tambulam | ఏ సందర్భాల్లో తాంబూలాలు ఇస్తారు.. వాటి ప్రత్యేకత ఏంటి?
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ?
ఇంటి ముందు గుమ్మడి కాయ ఎందుకు కడతారు?
జపం చేసేటప్పుడు జపమాలను చూపుడు వేలుతో ఎందుకు తిప్పకూడదు?