జగిత్యాల: ధర్మపురి (Dharmapuri) లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభంకానున్నారు. సోమవారం నుంచి 12 రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు పుట్ట బంగారం కార్యక్రమంతో వేదపండితులు ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. మంగళవారం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో తెప్పోత్సవం, డోలోత్సవం నిర్వహిస్తారు. ఈనెల 23న లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో రథోత్సవం జరుగనుంది. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
కాగా, పోలీస్ స్టేషన్ లో స్వామి పూజలందుకోవడం రాష్ట్రంలో ఇక్కడే జరుగుతుంది. ఏటా ఉత్సవాల్లో సపరివార సమేతంగా పీఎస్ కు దక్షిణ దిగ్యాత్రలో భాగంగా చేరుకుంటారు. అక్కడ పోలీసు కుటుంబాలు భక్తి శ్రద్ధలతో స్వామి వారికి పూజలు చేస్తారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ జీ రవి స్వామి వారికి స్వామి వారికి కల్యాణోత్సవం సందర్భంగా పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.