తిరుమల : తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 30 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. గురువారం స్వామివారిని 59,548 మంది భక్తులు దర్శించుకోగా 25,781 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.54 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.