బాలల కోసం లఘు నాటిక రచనల పోటీలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాపరి శోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) నిర్ణయించింది. ఉపాధ్యాయులు, రచయిత ల నుంచి రచనలను ఆహ్వానిస్తున్నది. తక్కువ పాత్రలు, సరళమైన సంభాషణలు, విద్యార్థుల స్థాయి, మనస్తత్వానికి తగ్గట్టుగా బాలల్లో దేశభక్తి, సున్నితమైన హాస్యం, నైతిక విలువలు, పర్యావరణం తదితర అంశాలతో రచనలు ఉండాలని ఎస్సీఈఆర్టీ కోరుతున్నది. ఇందుకోసం 3- 5 తరగతుల విద్యార్థుల కోసం ప్రాథమిక స్థాయిగా (డీటీపీ చేస్తే 3 పేజీలు), 6- 8 తరగతుల వారికి మాధ్యమిక స్థాయిగా (5 పేజీలు), 8- 10 తరగతుల కోసం ఉన్నత స్థాయిగా (7 పేజీలకు మించకుండా) రచనలు పరిగణిస్తారు. ఆసక్తిగల రచయితలు, బాల సాహిత్య వేత్తలు తమ రచనలను ఆగస్టు 10లోగా పంపాల్సి ఉంటుంది. పంపాల్సిన
చిరునామా: balasahityamscert.telangana@gmail.com
సువర్ణవినాయక్ (కో ఆర్డినేటర్) 9618676215
గాజుల రవీందర్(విషయ నిపుణులు) 9848255525