తిరుపతి: మహారాష్ట్ర ప్రభుత్వం వేంకటేశ్వర స్వామి భక్తులకు తీపి కబురు చెప్పింది. నవీ ముంబైలోని వేంకటేశ్వరుని ప్రతిరూప ఆలయాన్ని నిర్మించడానికి తిరుమల తిరుపతి దేవస్థానాలకు భూమిని కేటా యించింది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం నవీ ముంబైలోని ఉల్వేలో తెలుగు ఉగాది రోజున, గుడి పడ్వా-మరాఠీ కొత్త సంవత్సరం శుభ సందర్భంగా భూమిని కేటాయించింది. నవీ ముంబైలో నిర్మిస్తున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆలయ నిర్మాణానికి అనుమతి ని కోరుతూ ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి లేఖ రాశారు.
స్పందించిన మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భూమి కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని సిడ్కో అధికారులను ఆదేశించగా సిడ్కో డైరెక్టర్ల బోర్డు ఈ ప్రతిపాదనలకు అధికారికంగా ఆమోదం తెలిపింది. త్వరలో మహారాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులకు తుది ఆమోదం తెలుపుతుందని టీటీడీ వర్గాలు తెలిపాయి. టీటీడీకీ భూమి కేటాయింపు లో మహారాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ధన్యవాదాలు తెలిపారు.
రాబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా, నవీ ముంబై చుట్టుపక్కల నగరాలతో మంచి కనెక్టివిటీ ఉన్న ఉల్వే నోడ్లోని భూమిని ఆలయం కోసం గుర్తించారు.