గోదావరిఖని, మే 3: మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. రంజాన్ సందర్భంగా మసీద్ ఇమామ్లు, సదర్లు, మత పెద్దలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు కానుకలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. ముస్లిం విద్యార్థులు చదువు కోసం రెసిడెంట్ స్కూల్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలోని ముస్లింలకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తామన్నారు. ఇక్కడ మేయర్ అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, జడ్పీటీసీ నారాయణ, కార్పొరేటర్లు రమణారెడ్డి, బాల రాజ్కుమార్, నాయకులు జహీద్ పాషా, సలీం బేగ్, సిరాజొద్దీన్, సత్తార్ఖాన్, మత పెద్దలు అబ్దుల్ రహమన్, అక్రమం, జమల్, రహీం తదితరులు ఉన్నారు.
ధ్రువీకరణ పత్రాలు అందజేత
గోదావరి నదిలో లైఫ్ గార్డు, బోర్డు డ్రైవింగ్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సులను అందజేశారు. గోదావరి నది నిండుకుండలా మారడంతో ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయన్నారు. త్వరలోనే ఇక్కడ పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.