పెనుబల్లి: కుటుంబకలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నసంఘటన గురువారం మండలపరిధిలోని గంగదేవిపాడులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దంతాలపల్లి నాగార్జున (35) కుటుంబకలహాలతో మనస్తాపం చెంది తన పొలంలో పురుగుమందు తాగాడు. దీంతో స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వీయం బంజరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.