కందుకూరు : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని మండల పరిధిలోని రాచులూరు గ్రామానికి చెందిన తిరుమగమల్ల రాములు కుమారుడు శ్రీనాథ్ (23) మండల పరిధిలోని బేగరికంచె సమీపంలో గల అమెజాన్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం విధులకు హజరవ్వడానికి ఇంటి నుండి బైక్పై బయలు దేరాడు.
కటికపల్లి గ్రామం మీదుగా వెళుతుండగా గ్రామ సమీపంలోని రామాలయం వద్ద రోడ్డు మలుపు తిరుగుతుండగా, అదే రోడ్డులో వస్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టడంతో బైక్పై ఉన్న శ్రీనాధ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.