మహబూబ్ నగర్ : బైక్ అదుపుతప్పి యువకుడు దుర్మరణం చెందాడు. నారాయణపేట జిల్లా నర్వ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామశివారులో ఈ దుర్ఘటన జరిగింది. నర్వ మండలం పాతర్ చేడ్ గ్రామానికి చెందిన కురువ నర్సింహులు (28) వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్పై ఆత్మకూరుకు బయల్దేరాడు.
నాగిరెడ్డిపల్లి శివారుకు రాగానే బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట ధాన్యం రాశిపైకి దూసుకెళ్లి తలకు రాళ్లు బలంగా తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి నర్వ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.