తెలుగుయూనివర్సిటీ : గుర్తు తెలియని ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్కానిస్టేబుల్ బి. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం…
భరత్నగర్-బోరబండ రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం ఉదయం సమయంలో సుమారు 25-30 సంవత్సరాల వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని తీవ్రగాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు వెల్లడించారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్థారించామన్నారు.
మృతదేహాన్ని ఉస్మానియా దవఖానకు తరలించి మార్చురీలో భద్రపరిచి కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుని శరీరంపై స్కై బ్లూ రంగు పుల్ షర్టు, లైట్ బ్రౌన్ రంగు ప్యాంటు, రూప కంపనీ బనీయన్, డ్రాయర్ ధరించి ఉన్నాడని తెలిపారు. వివరాలకు 040-23202238 నెంబర్లో సంప్రదించవచ్చన్నారు.