ఖమ్మం: పురుగులుమందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మంలోని వైఎస్ఆర్నగర్లో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ నగర్కు చెందిన గంగుల శ్రావణ్ సూర్యాపేట జిల్లా చెవ్వెంల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి మూడు నెలల క్రితం ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకున్నాడు. తల్లి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ రాడంతో శ్రావణ్ భార్య పుట్టింటికి వెళ్లింది.
యువతిని నిర్భంధించిన తల్లిదండ్రులు అక్కడ పోలీస్ స్టేషన్లో శ్రావణ్పై వరకట్న వేదింపుల కింద కేసు పెట్టారు. దీనిపై మనస్తాపానికి గురైన శ్రావణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని తల్లిదండ్రులు హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రావణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.