అమరావతి : కర్నూలులో పెళ్లి చేసుకోమన్నందుకు ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు పెళ్లిచేసుకోమన్నందుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లకు చెందిన కొప్పురపు శ్రీనివాస్, భారతి దంపతుల కుమార్తె వైష్ణవి(26) అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్యపల్లె గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తోంది.
పెళ్లిచూపులు చూసేందుకు రెండు మూడు రోజుల్లో వస్తున్నారని ఆమె తల్లిదండ్రులు కూతురికి చెప్పారు. పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని వైష్ణవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ హరినాథ్రెడ్డి తెలిపారు.