జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం కిష్టంపేటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. లావణ్య అనే ఓ మహిళ తన ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకింది. ఈ ఘటనలో లావణ్య, ఆమె పెద్ద కుమారుడు గణేశ్(9) మృతిచెందగా చిన్న కొడుకు హర్షవర్దన్(6) ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. బావి నుంచి బయటపడి కేకలు వేయడంతో విషాదం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం.