హైదరాబాద్ : భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సరూర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఏడేండ్ల క్రితం శ్రీనాథ్ అనే వ్యక్తిని సీహెచ్ నాగలక్ష్మి(30) వివాహం చేసుకుంది. వీరికి ఐదేండ్ల వయసున్న బాలుడు ఉన్నాడు. అయితే శ్రీనాథ్, నాగలక్ష్మి పెళ్లైన తర్వాత.. ఆరు నెలలు మాత్రమే సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో భర్తతో పాటు అత్తమామలు కూడా ఆమెను వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులను భరించలేని నాగలక్ష్మి శనివారం తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.