కుత్బుల్లాపూర్ : ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ గృహిణి అదృశ్యమైన ఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దూలపల్లి వీకర్ సెక్షన్కు చెందిన షేక్ రషీయాబేగం(34) ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. ఆమె ఆచూకి కోసం కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల, బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో రషీయాబేగం భర్త అక్బర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.