కుత్బుల్లాపూర్ :పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గృహిణి అదృశ్యమైంది. గుంటూరు జిల్లాకు చెందిన రాంబాబు, నిధ(25) దంపతులు. గత కొన్నేళ్ల కిందట నగరంలోని గుండ్లపోచంపల్లికి వలస వచ్చి ఇద్దరూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 8న నిధ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి తిరిగి రాలేదు. భర్త రాంబాబు చుట్టు పక్కల వెతకడంతో పాటు మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.