లక్నో : మహిళకు పార్ట్టైం జాబ్ ఆఫర్ చేసిన స్కామర్లు ఆమె నుంచి ఏకంగా రూ. 3.37 లక్షలు కొట్టేసిన (Cyber Fraud) ఉదంతం లక్నోలో వెలుగుచూసింది. నగరానికి చెంఇన కుష్భు పాల్ అనే మహిళను నిందితులు పార్ట్ టైం జాబ్ పేరుతో మోసగించారు. నివాస్ పస్కర్ అనే వ్యక్తి ఆన్లైన్లో మహిళను పరిచయం చేసుకుని వీడియోలు, పోస్ట్లు లైక్ చేయడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బు ఆర్జించవచ్చని బాధితురాలిని మభ్యపెట్టాడు.
నిందితుడు ఆమెను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేశాడు. ఆపై నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్లో సైనింగ్ చేయాలని బాధితురాలిని పాల్ నమ్మబలికాడు. బ్యాంక్ అకౌంట్ను కూడా లింక్ చేయాలని కుష్భు పాల్పై నివాస్ పస్కర్ ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో ఆమె ఖాతా నుంచి పెద్దమొత్తంలో డబ్బును స్కామర్లు కాజేశారు. మోసపోయానని గుర్తించిన కుష్బూ పాల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని అమీనాబాద్ ఎస్హెచ్ఓ సునీల్ కుమార్ ఆజాద్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read More :
Google Map | కొంపముంచిన గూగుల్ మ్యాప్.. గౌరవెల్లి ప్రాజెక్టులోకి వెళ్లిన డీసీఎం