న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) రోజుకో స్కెచ్తో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. లేటెస్ట్గా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ స్కామర్ల చేతిలో నిలువునా మోసపోయారు. మహిళ క్రెడిట్ కార్డు నుంచి స్కామర్లు రూ. 90,000 కాజేశారు. ఒక మీల్స్ కొనుగోలు చేస్తే మరో మీల్స్ ఉచితం అనే ఆఫర్కు ఆకర్షితులైన వాయువ్య ఢిల్లీకి చెందిన 40 ఏండ్ల సవిత శర్మ స్కామర్ల చేతిలో మోసపోయారు.
ఓ బ్యాంక్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న మహిళ ఫేస్బుక్లో బై వన్ గెట్ వన్ ఆఫర్ చూసి సంబంధిత లింక్లోని ఫోన్ నెంబర్కు కాల్ చేసి వివరాలు అడిగారు. కాలర్ ఆమెకు ప్రముఖ రెస్టారెంట్ ఆఫర్ కోసం యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. యాప్ను యాక్సెస్ చేసుకునేందుకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ను కూడా పంపాడు. ఆఫర్ను పొందేందుకు తొలుత యాప్లో రిజిస్టర్ కావాలని నమ్మబలికాడు.
ఇక డబ్బును ఆమె క్రెడిట్ కార్డు నుంచి పేటీఎం ఖాతాకు బదిలీ చేయించి ఆపై స్కామర్ అకౌంట్లో వేసేలా ఆమెను మోసగించాడు. క్యూఆర్ కోడ్ పంపడం ద్వారా మహిళను స్కామర్ నిండా ముంచాడు. మోసపోయినట్టు గ్రహించిన మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More
Apache Helicopter: మధ్యప్రదేశ్లో అపాచీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్