న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్(Apache Helicopter).. ఇవాళ మధ్యప్రదేశ్లోని బిండ్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. చాపరల్లో ఏదో సాంకేతిక సమస్య వచ్చినట్లు పైలెట్ గుర్తించాడని అధికారులు తెలిపారు. ఆ వెంటనే హెలికాప్టర్ను ల్యాండ్ చేసినట్లు వెల్లడించారు. అయితే పైలెట్ అప్రమత్తంగా ఉండడం వల్ల హెలికాప్టర్ను సురక్షితంగా దించామని, భారీ ప్రమాదాన్ని తప్పించామని అధికారులు తెలిపారు. త్వరలోనే ఆ హెలికాప్టర్ మళ్లీ లేవనున్నది.
#WATCH | An Apache attack helicopter today made a precautionary landing in a field in a village in the Bhind district of Madhya Pradesh.
Visuals of the Apache helicopter and another chopper arriving to provide assistance to the Apache. https://t.co/hCfvqcw14S pic.twitter.com/1aEpBZEt8w
— ANI (@ANI) May 29, 2023
ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్.. ప్రపంచంలో అత్యంత ఆధునిక హెలికాప్టర్. మల్టీరోల్ ఆపరేషన్స్లో దీన్ని వాడుతారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. 2020లో బోయింగ్ సంస్థతో ఇండియన్ ఆర్మీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఆరు హెలికాప్టర్ల కోసం ఆ ఒప్పందం జరిగింది.