జోగులాంబ గద్వాల : ప్రమాదవశాత్తు ఓ మహిళ బావిలో పడి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన అలంపూర్ మండలం కాశాపురం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రేపల్లె రాములమ్మ ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. భర్త హుస్సేన్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ల కొరత : మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర
అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం