అమరావతి : వివాహిత ఇంట్లో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విజయవాడలోని మాచవరం ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వివాహిత మృతికి ఆమె భర్తే కారణమన్న అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు మాత్రం కుటుంబ కలహాల కారణంగానే మహిళ బలవన్మరణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. మృతురాలి భర్తను అన్నికోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.