ముదిగొండ: మండల పరిధిలోని వల్లభి గ్రామ శివారులో ట్రాక్టర్ పల్టీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి మండల పరిధిలోని మంగాపురం తండాకు చెందిన సుమారు 20 మంది కూలీలతో పెద్దమండవ గ్రామంలో పత్తి ఏరేందుకు వెళుతున్నారు. వల్లభి శివారులోని పెద్దతండా క్రాస్ రోడ్డు దగ్గర ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ సంఘటనలో మంగాపురం తండాకు చెందిన గుగులోతు అనిత (36) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా స్వల్ప గాయాలైన వారికి నేలకొండపల్లి పీహెచ్సీలో వైద్యం అందించారు.