మైసూర్ : ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త అడ్డు తొలగించుకునేందుకు మహిళ కుట్ర పన్ని అతడిని కడతేర్చిన ఘటన కర్నాటకలోని మైసూరులో కలకలం రేపింది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసిన మహిళ భర్తకు కాఫీలో మత్తుమందు కలిపిఇచ్చింది. ఆపై స్ప్రహ కోల్పోయిన భర్త ప్రైవేట్ భాగాలపై దాడి చేసి అనంతరం ఊపిరిఆడకుండా చేసి అంతమొందించింది. భర్త తలనొప్పితో కుప్పకూలాడని ఆపై ప్రాణాలు కోల్పోయాడని ఆమె కట్టుకథ అల్లినట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితురాలు ఉమకు మైసూర్లో వేర్హౌస్ కార్పొరేషన్లో పనిచేసే వెంకటరాజుతో పదేండ్ల కిందట వివాహమైంది. వెంకటరాజు కంటే ఉమ వయసులో ఇరవై ఏండ్లు చిన్న. వీరికి ఇద్దరు సంతానం కాగా నాలుగేండ్ల కిందట ఉమకు అవినాష్ అనే వ్యక్తితో కలిగిన పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తను అడ్డుతొలగించుకోవలనే ఆలోచనతో గత ఏడాది అక్టోబర్ 9న ప్రియుడితో కలిసి ఉమ ఈ ఘాతుకానికి తెగబడింది. పోలీసులు ఉమ ఆమె ప్రియుడు అవినాష్లను అరెస్ట్ చేశారు.