సూర్యాపేట : భార్య మరొక వ్యక్తితో అక్రమసంబంధం కలిగి ఉండటం తట్టుకోలేక మనస్తాపంతో ఒక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసున్న సంఘటన జిల్లాలోని మఠంపల్లి మండలం కొత్త తండాలో గురువారం వెలుగులోకి వచ్చింది . ఆత్మహత్యకు ముందు మృతుడు తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మఠంపల్లి మండలలోని అల్లీపురం గ్రామానికి చెందిన తాళ్ళూరి కాంతాచారి(32) అదే మండలం కొత్త తండాలో రైడో సాండ్ (రాయి నుంచి ఇసుక తయారీ )చేసే ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు.
అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతా కాలం నుంచి అతడి భార్య ఆమెతో కాలేజీ రోజుల్లో చదువుకున్న వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోంది. కాగా, ఇది తెలిసిన కాంతాచారి పలుమార్లు మందలించినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు నచ్చచెప్పిన వినలేదని దీంతో మానసిక వేదనకు గురైన కాంతాచారి బుధవారం రాత్రి భార్య అక్రమ సంబంధాన్ని సహించలేక కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
విషయం తెలిసిన బంధువులు, మిత్రులు అక్కడ నుంచి తీసుకొచ్చారు. మళ్లీ రాత్రి తన సొంత శాండ్ ఫ్యాకరీలో గురువారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాంతాచారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
విషాదం : ఆరెగూడెంలో వృద్ధ దంపతుల బలవన్మరణం
బీసీలకు ఈటల క్షమాపణ చెప్పాలి : ఎల్ రమణ
Olympic First Gold : ఒలింపిక్స్లో భారత్కు తొలి బంగారు పతకం.. ఏదంటే..?