నాలుగు రోజుల క్రితం ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో భారత్ బంగారం పతకంతో సగర్వంగా పోటీలను ముగించింది. ఈ పోటీల్లో ఒక స్వర్ణంతోపాటు రెండు కాంస్యాలు, నాలుగు రజతాలు.. మొత్తం ఏడు పతకాలను తన ఖాతాలో వేసుకుని 48 వ స్థానంలో నిలిచింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో వ్యక్తిగతంగా స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా.. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. అయితే, సరిగ్గా 73 సంవత్సరాల క్రితం భారత్.. లండన్ ఒలింపిక్స్లో స్వర్ణం (Olympic First Gold) సాధించి భళా అనిపించింది. మేజర్ ధ్యాన్చంద్ నేతృత్వంలోని భారతదేశం హాకీ జట్టు అద్భుత పోరాట పటిమను ప్రదర్శించి చరిత్రలో నిలిచేలా చేసింది.
లండన్లో 1948 లో విజయవంతంగా నిర్వహించారు. ఈ ఒలింపిక్స్కు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి రెండో ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత నిర్వహించిన తొలి ఒలింపిక్ గేమ్స్ కాగా.. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం భారతదేశం తొలిసారిగా ఒలింపిక్స్లో పాల్గొనడం. భారతదేశం నుంచి 39 ఈవెంట్స్కు గాను 79 మంది క్రీడాకారులను లండన్కు పంపారు. 1936 జర్మీనీ ఒలింపిక్స్లో ఆతిథ్య జర్మనీని 8-1 తేడాతో ఓడించిన భారత్ హాకీ జట్టు ఏదైనా పతకం వస్తుందని తొలి నుంచి అందరూ భారీగా ఆశలు పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ను 4-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి భారత జట్టు స్వర్ణం కైవసం చేసుకున్నది. దీనికన్నా ముందు అఖండ భారత్ వరుసగా మూడు స్వర్ణ పతకాలు గెలిచింది. భారత్ విడిపోయిన తర్వాత ఈ జట్టులోని చాలా మంది హాకీ క్రీడాకారులు అనంతర కాలంలో పాకిస్తాన్ తరపున ఆడారు.
ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్ బొంబాయిలో నిర్వహించారు. అయితే, కొన్ని కారణాల వల్ల సరైన సమయానికి లండన్ చేరుకునే అవకాశాలు లేకపోవడంతో.. పారిశ్రామికవేత్త రతన్ టాటా జోక్యం చేసుకుని తన స్వంత ఖర్చుతో హాకీ జట్టును విమానమెక్కించి పంపించారు. దాంతో లండన్ చేరుకున్న హాకీ జట్టు.. ఒలింపిక్స్ పూల్ ఏ లో ఆస్ట్రియా, స్పెయిన్, అర్జెంటీనాలను మట్టికరిపించి.. సెమీ ఫైనల్స్ నెదర్లాండ్స్పై గెలిచింది. ఫైనల్లో గ్రేట్ బ్రిటన్పై 4-0 గోల్స్తో గెలిచి చరిత్ర సృష్టించింది. హాకీలో విజయంతో బ్రిటీష్ గడ్డపై తొలిసారి మువ్వన్నెల జెండా రెపరెలాడింది. భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.
2018: సూర్యుడి బయటి పొరను అధ్యయనం చేసేందుకు పార్కర్ సోలార్ ప్రోబ్ను ప్రారంభించిన నాసా
1980: మెక్సికోలోని జంతుప్రదర్శనశాలలో తొలిసారి చైనా వెలుపట పాండా జననం
1961: బెర్లిన్ గోడ నిర్మాణాన్ని ప్రారంభించిన తూర్పు జర్మనీ
1953: మొదటి హైడ్రోజన్ బాంబును పరీక్షించిన సోవియట్ యూనియన్
1919: భారత అంతరిక్ష పరిశోధనా పితామహుడు విక్రమ్ సారాభాయ్ జననం
1981 : పర్సనల్ కంప్యూటర్ను లాంచ్ చేసిన ఐబీఎం
1877 : ధ్వనిని రికార్డు చేసి తిరిగి వినే అవకాశమున్న ఫోనోగ్రాఫ్ను కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్
1851: కుట్టు యంత్రానికి పేటెంట్ పొందిన ఐజాక్ మెరిట్ సింగర్
ఐసీసీ ర్యాంకింగ్స్లో పైకి బుమ్రా.. కిందికి కోహ్లీ
కూరగాయలను సబ్బుతో కడుగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి..
ఇవి ఎకో ఫ్రెండ్లీ బూట్లు.. ఉత్పత్తి ఎక్కడో తెలుసా..?
డయాబెటిస్ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..