యాదాద్రి భువనగిరి : మేడ్చల్ జిల్లా కీసరలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన వార్డు మెంబరు రుద్రబోయిన బాలరాజుగౌడ్ మేడ్చల్ జిల్లా కీసర ప్రాంతంలో హత్యకు గురయ్యాడు.
బాలరాజు గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపార రీత్యా హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్నాడు. సోమవారం ఉదయం కీసర పోలీసు స్టేషన్ పరిధిలో హత్యకు గురయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.