దోమ : కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు సేవించి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. గురువారం ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అయినాపూర్ గ్రామానికి చెందిన సంగిని నర్సింహులు, ఎల్లమ్మ దంపతులకు అంజమ్మ (17) ఏకైక కుమార్తే. కడుపునొప్పి బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తల్లి వెంటనే పరిగిలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.