హైదరాబాద్ : సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ గదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని విజయవాడకు చెందిన శబరీనాథ్ గుర్తించారు. శబరీనాథ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.