ఎర్రుపాలెం: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం ఎర్రుపాలెంలో చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ దగ్గరలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. మృతుడికి సుమారు 35ఏండ్ల వయస్సు ఉండొచ్చని, బూడిదరంగు షర్ట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఖమ్మం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9440627535, 944070004 నెంబర్లను సంప్రదించా లనిపోలీసులు కోరారు.