మేడ్చల్, ఆగస్టు : వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని శ్రీ దర్శిని హోటల్ ఎదురుగా సోమవారం అర్థరాత్రి 44వ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా నగరం వైపు వెళుతున్న ఓ వాహనం ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించగా సుమారు 25 ఏండ్ల వ్యక్తిగా గుర్తించారు. గత కొద్ది రోజులుగా మేడ్చల్లో అతను బిక్షాటన చేసుకుంటూ తిరుగుతుండే వాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ దవాఖానా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ అశోక్ తెలిపారు.