భద్రాద్రి కొత్తగూడెం : ప్రభుత్వ అనుమతిలేని మిరప విత్తనాల ప్యాకెట్లను పోలీసులు, వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు. జిల్లాలోనేఇ సుజాతనగర్ మండల కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ షాపులో అధికారులు తనిఖీ నిర్వహించగా ఈ నకిలీ విత్తనాల ప్యాకెట్లు లభ్యమయ్యాయి. మండలంలోని సాయిలక్ష్మి ఫెర్టిలైజర్ యజమాని అనుమతి పత్రాలు లేకుండా అమ్మకాలకు సిద్ధంగా ఉన్న 2016 ద్వారకా లిమిటెడ్కు సంబంధించిన స్టార్ బిందు మిరప విత్తనాల ప్యాకెట్లను వీఎం బంజర ఎస్సై తోట నాగరాజు ఇచ్చిన సమాచారం మేరకు వ్యవసాయశాఖ అధికారి నర్మద మంగళవారం తనిఖీ చేశారు.
అవి అనుమతి లేని విత్తన ప్యాకెట్లేనని గుర్తించి సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.30.24 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. అలాగే సాయిలక్ష్మి ఏజెన్సీలో ఏన్కూరుకు చెందిన ఓ రైతు విత్తనాలు తీసుకున్నాడు. అనుమానం వచ్చి అనుమతులు లేని విత్తనాలు అనుకొని ఏన్కూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఏన్కూరు ఎస్సై అందుబాటులో లేకపోవడంతో వీఎం బజర సర్కిల్ పరిధి కావడంతో వీఎం బంజర ఎస్సై తనిఖీకి చేశారు. అవి అనుమతిలేని విత్తనాలేనని నిర్ధారించారు. ఎస్సై, ఏవోలు వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దేశానికే ఆదర్శం ఇంటింటికి జ్వర సర్వే : ఎమ్మెల్సీ కవిత
బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం