నాగర్కర్నూల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఉప్పునుంతల మండలం పిరట్వాని పల్లి స్టేజి సమీపంలో జరిగింది.
స్థానికుల కథనం మేరకు..హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారి పిరట్వానుపల్లి స్టేజీ వద్ద కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఉప్పునుంతల మండలం నడింపల్లికి చెందిన బావ, బావమరుదులు బాల చంద్రయ్య (32), చెన్నయ్య (33) మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.