మెదక్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మెదక్ మండలం మాచవరం వద్ద చోటు చేసుకుంది. కాగా,
సంగారెడ్డి పర్యటన ముగించుకొని మెదక్ వస్తున్నా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. పోలీసులకు, అంబులెన్సు కు సమాచారం అందించారు.
అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతున్న యువకులను చూసి చలించిన ఎమ్మెల్యే వెంటనే తన వాహనంలో గాయపడిన క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డాక్టర్తో మాట్లాడి మెరుగైన చికిత్స అందిలంచాలని సూచించారు. అనంతరం మరో వాహనం లేకపోవడంతో మెదక్ రూరల్ ఎస్ఐ వాహనంలో క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.