బోనకల్లు: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండలంలో విద్యుత్ షాక్తో ఒకరు మృతిచెందగా, మరొకరు వాటర్ట్యాంక్పై నుంచి జారీపడి మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గోవిందాపురం గ్రామానికి చెందిన షేక్ నాగులు(45) తన ఇంట్లో విద్యుత్ బోర్డు రిపేర్ చేసే క్రమంలో విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మరోఘటనలో రావినూతల గ్రామానికి చెందిన అల్లిక బక్కయ్య(53) బోనకల్లు ఎస్సీ గురుకుల పాఠశాల రెండో అంతస్తుపై ఉన్న వాటర్ట్యాంక్ను శుభ్రం చేసేందుకు ట్యాంకు మూత తీసే క్రమంలో ప్రమాదవశాత్తు ట్యాంక్పై నుంచి కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ రెండు సంఘటనలపై స్థానిక ఎస్సై కొండలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.