పాపన్నపేట (మెదక్) : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. పాపన్నపేట మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామం వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకున్నది. పాపన్నపేట ఎస్ఐ విజయ్ కుమార్ సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా భీమవరం గ్రామానికి చెందిన కొమ్మి శెట్టి మధు (45), కొమ్మి శెట్టి శ్రీనివాస్ కొద్ది రోజులు మేస్త్రీ పని చేసుకుంటూ పొడిచాన్పల్లి తండాలో నివాసం ఉంటున్నారు.
బుధవారం రాత్రి కూరగాయలు తీసుకొని బైక్పై లక్ష్మీనగర్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. దీంతో మధు అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీనివాస్ను 108 వాహనంలో మెదక్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధుకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉండగా.. శ్రీనివాస్కు ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు సమాచారం.