TSRTC | కాకినాడ : కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు.. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ భాస్కర్ రావుకు బీపీ డౌన్ కావడంతో బస్సుపై ఆయన నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి, బోల్తా పడింది.
ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. అంబులెన్స్లో డ్రైవర్తో పాటు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అన్నవరం ఎస్ఐ కిశోర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కేవలం బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి.