Delhi Road Accident | ఉత్తర ఢిల్లీ (North Delhi)లోని అలీపూర్ లో గల జీటీ కర్నాల్ రోడ్డు (GT Karnal road)లో బుధవారం అర్ధరాత్రి రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీటీ కర్నాల్ మార్గంలో ఓ ట్రక్కు 20 మంది కన్వర్ యాత్రికులతో (kanwar yatris) హరిద్వార్ కు వెళుతోంది. ఢిల్లీకి వస్తున్న మరో ట్రక్కు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి.. అనంతరం యాత్రికుల ట్రక్కుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
Also Read..
Loan app | లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Samantha | ఈరోజు నా జీవితంలో ఎంతో ప్రత్యేకం.. సమంత పోస్ట్ వైరల్
Actor Vijay | సిగ్నల్ జంప్ చేసిన కారు.. దళపతి విజయ్ కు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు