Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. సామ్ సినిమాలకు కాస్త విరామం ఇవ్వనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ (Myositis) అనే వ్యాధి బారిన పడిన సమంత.. దాని చికిత్స కోసం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సామ్ ‘ఖుషి’ (Kushi) సినిమాతో పాటు, సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తైన వెంటనే సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ మూడు రోజుల క్రితం సమంత.. ‘కారవాన్ లైఫ్.. మరో మూడు రోజులు మాత్రమే’ అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో పేర్కొంటూ అందరికీ షాక్ ఇచ్చింది.
తాజాగా మరో కొత్త అప్ డేట్ తో అభిమానుల ముందుకొచ్చింది. ఈరోజు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని తెలిపింది. సెల్ఫీ ఫొటో షేర్ చేసిన సమంత.. ‘జులై 13 నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజుతో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ పూర్తైంది’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
రాజ్-డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్లో వరుణ్ధవన్, సమంత నటిస్తున్నారని తెలిసిందే. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ఇది. ఇక సామ్.. సిటాడెల్ తో పాటు టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Also Read..
Actor Vijay | సిగ్నల్ జంప్ చేసిన కారు.. దళపతి విజయ్ కు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు
Delhi Rains | యమునా నది మహోగ్రరూపం.. కేజ్రీవాల్ ఇంటి సమీపంలోకి చేరిన వరద