ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ట్రక్ డ్రైవర్తో గొడవ పడ్డారా తల్లీకూతుళ్లు. ఆ గొడవ చూసిన చుట్టుపక్కల వాళ్లు కలగజేసుకొని గొడవ పెద్దది కాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అదే అదనుగా తీసుకున్న ట్రక్ డ్రైవర్.. ఆ తల్లీకూతుళ్లను వెంబడించి, దారి మధ్యలో తన ట్రక్తో తొక్కేసి చంపేశాడు. ఈ ఘటన ఒడిశాలోని జజ్పూర్లో వెలుగు చూసింది.
ఒడిశా లివ్లిహుడ్ మిషన్లో భాగంగా బుక్ కీపర్గా పనిచేస్తున్న శ్రుతికా చక్రవర్తి (47).. తన కుమార్తె లిపికా చక్రవర్తి (24)తో కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. శ్రుతికా తండ్రి కొన్నిరోజుల క్రితమే చనిపోయారు. ఆయన 11వ రోజు కర్మల్లో పాల్గొని కుమార్తెతో కలిసి శ్రుతికా ఇంటికి వెళ్తోంది. లిపికా స్థానికంగా ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది.
వీళ్లిద్దరూ వెళ్తుండగా అమర్ స్వాయిన్ అనే ట్రక్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. అది చూసిన తల్లీకూతుళ్లు అతనితో గొడవపడ్డారు. దీంతో కోపం తెచ్చుకున్న అమర్.. వాళ్లను వెంబడించి ట్రక్తో తొక్కేసి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 302 (హత్య) కింద అతన్ని బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.