వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన రాయపర్తి మండలం కొండూరు గ్రామ శివారులోని జింకురామ్ తండాలో చోటు చేసుకుంది. డ్రైవర్ కుమార్ (48) ట్రాక్టర్తో వ్యవసాయ భూమి దున్నుతుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కుమార్ వర్ధన్నపేట మండలం రామవరం గ్రామస్తుడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాయపర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
నిజామాబాద్ జిల్లాలో దారుణం..నీటిగుంతలో రెండు మృత దేహాలు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Space Wedding : అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
OBC Bill: కోటాపై సీలింగ్ను ఎత్తివేయండి : అధిర్ రంజన్ చౌదరీ