జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అన్నను కాపాడబోయి తమ్ముడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన గోవిందుపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మనోహర్రావు కథనం ప్రకారం.. గోవిందుపల్లి గ్రామానికి చెందిన బద్దం శంకర్ రెడ్డి, బద్దం యతేశ్వర్ రెడ్డి అన్నదమ్ములు. కరెంట్ మోటర్ పెట్టడానికి గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్లారు.
మోటర్ పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు అన్న శంకర్ రెడ్డికి విద్యుత్ షాక్ రావడంతో అతడు అరిచాడు. దీంతో అన్నను రక్షించే క్రమంలో విద్యుత్ షాక్ అని గుర్తించని యతేశ్వర్ రెడ్డి కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. యతీశ్వర్ రెడ్డి భార్య తిరుపతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యతీశ్వర్ రెడ్డికి ఇద్దరు భార్యలు, ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Nizamabad incident | అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితుల అరెస్ట్
Crime news | భూ తగాదాలో తండ్రిని చంపిన తనయులు
Nizamabad | గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి
పింక్ టెస్ట్లో అదరగొడుతున్న అమ్మాయిలు.. స్మృతి హాఫ్ సెంచరీ