రామంతాపూర్ : చౌటుప్పల్ మండంలో ధర్మోజీగూడెం వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టడంతో రామంతాపూర్ కు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. రామంతాపూర్ లోని నెహ్రూనగర్, భరత్నగర్ లకు చెందిన హరీష్, సల్మాన్, అసీఫ్ లు హరీష్ స్వగ్రామంలో జరిగిన వివాహానికి హజరై రాత్రి 2: 30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టడంతో వారు అక్కడి కక్కడే మృతి చెందారు.
మరణ వార్త తెలియడంతో మృతుల తల్లి, తండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ప్రమాదంలో మరణించిన ఈ ముగ్గురు యువకులు ఏసీ మెకానిక్లు గా పనిచేస్తున్నారు.