కూసుమంచి: కూసుమంచి మండలం నాయక్గూడెంలోని లక్ష్మీతిరుపతమ్మ వారి ఆలయంలో 17 రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీ జరిగింది. అక్టోబర్1వ తేదీన రూ.10 వేల విలువ గల హుండీని పగుల గొట్టి అందులోని నగదును అపహరించారు గొంగలు. ఆసమయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోసారి శనివారం చోరీ జరిగిందని, ఈ సారి చోరీకి పాల్పడిన దుండగులు సీసీ కెమేరాలను తొలగించి మరీ చోరీకి పాల్పడ్డారు.