నారాయణఖేడ్ /సంగాడ్డి : వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ యువకుడు మృతి చెందిన విషాద సంఘటన నారాయణఖేడ్ మండలం మాధ్వార్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మహిపాల్ అనే వ్యక్తి మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా, కిరాణా సరుకులు తెచ్చేందుకు హనుమంతారవుపేట గ్రామానికి వెళ్లిన మహిపాల్ సరుకులు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు.
మాధ్వార్ గ్రామ శివారులోని మత్తడి పొంగి ప్రవహిస్తుండడంతో మహిపాల్ మత్తడిని దాటుతున్న క్రమంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి మహిపాల్ను ఒడ్డుకు చేర్చినప్పటికి అప్పటికే మృతి చెందాడు. మృతుడి తల్లి మల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.