రంగారెడ్డి : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోపడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన జిల్లాలోని మంచాల పోలీస్టేషన్ పరిధిలోని చీదేడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..చీదేడు గ్రామానికి చెందిన గునుకుల నర్సమ్మ (88) ఉదయం సమయంలో ఊరు పక్కన ఉన్న వ్యవసాయ బావి పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో నర్సమ్మ బావిలోపడి మృతి చెందినట్లు చెప్పారు. ఈమేరకు మంచాల ఎస్సై సురేష్ కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల