మహబూబాబాద్: సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలంటూ శ్రీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
తన స్వగ్రామం జిల్లాలోని గుండ్రాతి మడుగులో నేడు పంచాగ శ్రవణంలో జిల్లా జడ్పీ చైర్మన్ కుమారి ఆంగోతు బిందు, స్థానిక జడ్పీటీసి బండి వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాసరెడ్డి, మూల మధుకర్ రెడ్డి, కొమ్మినేని రవీందర్, బోడ శ్రీను, శ్రీకాంత్ నాయక్, వనజా శ్రీరామ్, ఇతర నేతలతో కలిసి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంతరి మాట్లాడుతూ..ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.