నందిగామ : చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మణ్ (45) గ్రామంలోని అంబపురం చెరువులో చేపలు పట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. దీంతో పోలీసులు సంఘటన స్థాలనికీ చెరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందిగామ పోలీసులు తెలిపారు.