సంగారెడ్డి : జిన్నారం మండలం వావిలాల గ్రామ శివారులో నీటి గుంటలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బొల్లారం ఎస్ఐ సిద్ది రాములు తెలిపిన వివరాల ప్రకారం..గడ్డపోతారంలో నివాసం ఉంటున్న చల్ల నాగేంద్రప్రసాద్(45) కొన్ని రోజుల క్రితం వరకు స్థానిక పరిశ్రమల్లో పనిచేశాడు. మద్యానికి బానిసై నాగేంద్రప్రసాద్ ఇంటి వద్దనే ఉంటున్నాడు. కాగా, ఈ నెల 14వ తేదీ బుధవారం ఊరికి వెళ్తున్నానిఇంట్లో చెప్పి ఇంటికి తిరిగి రాలేదు.
వావిలాల శివారులో నీటి గుంటలో శవమై కనిపించాడు. స్థానికులు గుర్తించి బొల్లారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడు నాగేంద్రప్రసాద్ గా గుర్తించారు. మృతుడి భార్య చల్ల రత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?
పేదలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సానియా మీర్జా, షోయెబ్ జంటకు యూఏఈ గోల్డెన్ వీసా జారీ